Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాక్లెట్లు కొనిస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు... నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు!

హైదరాబాద్ సమీపంలోని మన్సూరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన ఓ కామాంధుడు.. బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి

చాక్లెట్లు కొనిస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు... నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు!
, శనివారం, 11 మార్చి 2017 (16:37 IST)
హైదరాబాద్ సమీపంలోని మన్సూరాబాద్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగింది. వీధిలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ళ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని నమ్మించిన ఓ కామాంధుడు.. బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మన్సూరాబాద్‌‌లోని ఓ బస్తీ ప్రాంతంలో నివశించే రాకేష్‌ రెడ్డి (19) బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కూలిపనికెళ్లిన తల్లి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కూతురు కనిపించకపోవడంతో పరిసరాల్లో తల్లిదండ్రులు గాలించారు.
 
అయితే, ఆ బాలికను రాకేష్ రెడ్డి బైకుపై తీసుకెళ్లడాన్ని తోటి చిన్నారులు చూశారు. ఇంతలో బాలికను రాకేష్ బైక్‌పై తీసు కొచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్లావని బాలిక తల్లిదండ్రులు అడగితే బైక్‌ విడిచిపెట్టి పారిపోయాడు.
 
ఏం జరిగిందని కూతురిని తల్లిదండ్రులు అడగగా.. చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. అదేరోజు రాత్రి వారు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ఫోక్సో, నిర్భయ కేసులు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కసారి కూడా కోర్కె తీర్చలేదు.. ఆయన నపుంసకుడు.. విడాకులు కావాలి...