Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి ఎండలే ఎండలు.. దక్షిణాదిన సాధారణం 43 డిగ్రీలు

ఈ యేడాది వేసవి కాలంలో ఎండలు మండిపోనున్నాయి. సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా, దక్షిణాదిలో ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్, విశాఖపట్

ఈసారి ఎండలే ఎండలు.. దక్షిణాదిన సాధారణం 43 డిగ్రీలు
, బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (08:51 IST)
ఈ యేడాది వేసవి కాలంలో ఎండలు మండిపోనున్నాయి. సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా, దక్షిణాదిలో ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్, విశాఖపట్టణం వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం.. ఈ యేడాది అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ శీతాకాలం సుదీర్ఘంగా కొనసాగుతుండటమే. అంటే పలు ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో చలి నమోదవుతుంది.
 
మార్చి నుంచి మే నెల వరకు గల వేసవిలో ఉత్తర, వాయువ్య భారతాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ముఖ్యంగా వాయువ్య భారతంలో అసాధారణ ఎండలు ఉంటాయి. దక్షిణాదిలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని పలు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. 
 
అసాధారణ ఉష్ణోగ్రతలకు తోడు అదేసమయంలో వచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుంటాయని చెబుతున్నారు. అయితే ఉత్తరాది కంటే వాయువ్య భారతం ప్రధానంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎడారి మీదుగా వీచే గాలులతో వాయువ్య భారతం దానికి ఆనుకుని మధ్యభారతం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర, వాయువ్య భారతాలతో పోల్చితే దక్షిణాదిలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదుకావచ్చు.
 
మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధికంగా 43-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదువుతుందని అంచనా వేస్తున్నట్లు బేగంపేట వాతావరణశాఖ డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా పరిగణిస్తారు. అక్కడక్కడా 42 నుంచి 43 డిగ్రీలు కూడా సాధారణం కిందే లెక్క. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే ఎండ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్యుడికి అందుబాటులో సినిమా... మంత్రి స్పష్టీకరణ