Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు

rain
, ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (17:35 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్నాటక వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ముఖ్యంగా, ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో వానలు కురుస్తాయని పేర్కొంది. 
 
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడుతుందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం