Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల పంట పండింది... 4 రోజులు వానలే వానలే

Advertiesment
Heavy Rainfall
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (10:51 IST)
తెలుగు రాష్ట్రాల పంట పండింది. వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే, ఈ సంవత్సరం ఇప్పటివరకు మూడు శాతం తక్కువగా వర్షాలు కురిశాయన్నారు. 
 
ఇక కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు, ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్గాలకు అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీమల #TeamEffort అదిరింది.. అప్పుడేమో సైనికులు.. ఇప్పుడేమో చీమలు.. (వీడియో)