Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో కలసి.. భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి.. చంపేందుకు భార్య యత్నం

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి హత్య చేసేందుకు యత్నించింది. ఈ వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా దుర్గి

ప్రియుడితో కలసి.. భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి.. చంపేందుకు భార్య యత్నం
, మంగళవారం, 3 జనవరి 2017 (10:21 IST)
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి హత్య చేసేందుకు యత్నించింది. ఈ వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన మేకల సుధారాణి అదే గ్రామానికి చెందిన వీర నీలాంజనేయులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొన్నేళ్లుగా కొనసాగిస్తోంది. తమ సంబంధానికి భర్త చిన అమ్మోరయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన సుధారాణి ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని ఓ ప్లాన్ వేసింది. 
 
అర్థరాత్రి దాటాక ప్రియుడు నీలాంజనేయులుకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించుకుంది. నిద్రిస్తున్న అమ్మోరయ్యను కడతేర్చేందుకు రంగంలోకి దిగారు. నీలాంజనేయులు దిండుతీసి అమ్మోరయ్య ముఖంపై ఉంచి ఊపిరాడకుండా చేస్తూ మరోవైపు ఇటుక రాయితో గుండెపై బాదుతుండగా సుధారాణి అమ్మోరయ్య మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచే యత్నంచేసింది. 
 
ఊహించని పరిణామం నుంచి అమ్మోరయ్య తేరుకొని వారిని ప్రతిఘటిస్తూ బిగ్గరగా కేకలు వేశాడు. పక్క ఇంట్లో నిద్రిస్తున్న అమ్మోరయ్య అన్న కుమార్తె అమల, తల్లి తిరుపతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి రాకను పసిగట్టిన నీలాంజనేయులు తన ఇంటికి పారిపోగా సుధారాణి డాబాపై ఎక్కి దాక్కుంది. వారి దుర్మార్గంతో నిలువెల్లా రగిలిపోయిన అమ్మోరయ్య బంధువర్గీయులు నీలాంజనేయులు, సుధారాణిలను వెతికి పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి అదే ఇంట్లో తెల్లారేదాకా నిర్బంధించారు. అనంతరం దుర్గి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థాయ్‌లాండ్‌లో నడిరోడ్డుపై 25 మంది సజీవదహనం