Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూజ చేస్తున్నట్లు నటించి బంగారాన్ని దోచేసుకున్న దొంగబాబా

దొంగబాబా గుట్టు రట్టు అయ్యింది. గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి చోటుచేసుకుంది. గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆ

పూజ చేస్తున్నట్లు నటించి బంగారాన్ని దోచేసుకున్న దొంగబాబా
, ఆదివారం, 29 జనవరి 2017 (14:00 IST)
దొంగబాబా గుట్టు రట్టు అయ్యింది. గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి చోటుచేసుకుంది. గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆభరణాలను దొంగ పూజారి మాయం చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకుగాను ఓ పూజారిని పిలిపించాడు.
 
పూజలో కొంత బంగారాన్ని పెట్టాలని నకిలీ పూజారి సూచించాడు. ఈ మాటలను నమ్మిన వ్యాపారి శ్రీనివాస రావు పూజలో యాభైవేల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను పూజలో పెట్టాడు. కాసేపు పూజ చేస్తున్నట్లు నటించిన నకిలీ పూజారి ఆ బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. 
 
పూజ పూర్తైందని చెప్పి నకిలీ పూజారి అక్కడి నుండి పారిపోయాడు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత బంగారం మాయమైందన్న విషయాన్ని గ్రహించిన వ్యాపారి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన మహిళా న్యాయమూర్తి.. ఆంక్షల్ని నిలిపేసింది..