Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హైవేపై త‌ల‌ను విసిరి పారిపోయారు...

రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హైవేపై త‌ల‌ను విసిరి పారిపోయారు...
, మంగళవారం, 26 జులై 2016 (16:20 IST)
రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓక గుర్తు తెలియని పురుషుని తల హ్యపీక్ల‌బ్ ప్రాంతంలో పడివుంది. 
 
మొండెము ఎక్కడుంది ఇంకా తెలియలేదు. ప్రమాదం అనుకోవటానికి ఆనవాళ్ళు లేవు. తప్పకుండా అది హత్యే... అయితే హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ మర్డర్‌కు ఎవరు కారణం, ఎందుకు చేశారు అన్నది ప్ర‌శ్నగానే మిగిలింది. పోలిసులు, స్థానికులు మాత్రం గుంటూరు, విజయవాడ హైవే మీద వెళుతూ వెహికల్‌లో తలను మాత్రమే ఈ ప్రాంతంలో విసిరి మొండెమును వేరే ప్రాంతంలో వేసివుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
 
అయితే రాజధాని ప్రాంతంలో పోలీసు నిఘా అనేది లేదని సృష్టంగా ఈ సంఘటన తెలియజేస్తుంది. మున్సిపాలిటీ నుండి కేవలం ఒక కిలో మీటరు దూరంలో ఏమి జరుగుతుంతో ఏమి తెలియని స్థితిలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఉన్నారని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ నుంచి ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్: రూ.499 వార్షిక చందాతో పలు రకాల సేవలు!