Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులూ... ఈ నెల 30న తిండి దొరకదు... తస్మాత్ జాగ్రత్త...

హోటల్ రంగంపై జిఎస్‌టి విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ళ బంద్ నిర్వహిస్తున్నట్లు ఎపి హోటళ్ళ అసోసియేషన్‌ నాయకులు కె.వి.చౌదరి తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. జిఎస్టీ విధా

Advertiesment
GST effect
, సోమవారం, 29 మే 2017 (12:33 IST)
హోటల్ రంగంపై జిఎస్‌టి విధానంలో పెంచిన పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లో ఒకరోజు పాటు హోటళ్ళ బంద్ నిర్వహిస్తున్నట్లు ఎపి హోటళ్ళ అసోసియేషన్‌ నాయకులు కె.వి.చౌదరి తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. జిఎస్టీ విధానం ద్వారా నాన్‌ఎసీ రెస్టారెంట్‌కు 12 శాతం, ఎసి రెస్టారెంట్‌కు 18 శాతంగా పన్ను నిర్ణయించడం దారుణమన్నారాయన. 
 
ప్రస్తుతం ఎపిలో 5 శాతం, తమిళనాడులో 2 శాతం పన్నులు ఉన్నాయని, దీన్ని ఒక్కసారిగా 18 శాతం పెంచి వినియోగదారుడిపై మోయలేని భారాన్ని వేయడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను శాతాన్ని తగ్గించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హోటళ్ళ మూసివేత కారణంగా ప్రపంచ నలమూలల నుంచి తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు కష్టాలు తప్పవు. 
 
ఇప్పటికే కొండంత జనం. ఎక్కడ చూసినా భక్తులే. ఇలాంటి పరిస్థితిలో హోటళ్ళను మూసేస్తే భక్తులకు కష్టాలు తప్పవు. అందులోను సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి తినుబండారాలు తమ వెంటన తెచ్చుకోరు. ఎక్కడైనా కనిపించే హోటళ్ళలో కనిపిస్తే తినేసి వెళ్ళిపోతుంటారు. అలాంటిది రేపు హోటళ్ళు మొత్తం మూసివేస్తుండడంతో భక్తుల కష్టాలు తప్పవు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాత్మాగాంధీ హత్య.. ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారు.. అది గాడ్సే పిస్టల్ నుంచి పేలలేదా?