Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: గ్రామ సచివాలయ ఉద్యోగులతో మంత్రి సురేష్

ప్రభుత్వానికి మంచిపేరు తేవాలి: గ్రామ సచివాలయ ఉద్యోగులతో మంత్రి సురేష్
, గురువారం, 3 జూన్ 2021 (11:18 IST)
గ్రామ సచివాలయ ఉద్యోగులు బాధ్యతనెరిగి పనిచేయాలని, మీ పనితీరు వల్ల ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మార్కాపురం లోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మీ ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందని, మీ బాధ్యతను గుర్తెరిగి మీరు పని చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాటు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవలు అందించి ప్రజా ప్రభుత్వం గా గుర్తింపు పొందిందని రాబోయే రోజుల్లో మీ పనితీరు ఆధారంగా ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరారు.  ముఖ్యంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పై శ్రద్ధ చూపాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యా పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లను సమన్వయం చేసుకుంటూ రైతులకు అందాల్సిన రాయితీలు సక్రమంగా అందించాలని ఆదేశించారు.

విత్తనాలు ఎరువులు పురుగు మందులు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా కార్యక్రమం అందేలా చూడాలని, పంట నష్టపోతున్న రైతులకు భీమా సౌకర్యం పై అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలని కోరారు. రైతులకు అందాల్సిన రాయితీల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్ : కోర్టు అనుమతితో ఒకే?