Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయనగరంలో కీచక పర్వం : టెన్త్ బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య

విజయనగరం జిల్లాలో కీచక పర్వం జరిగింది. ఓ పదో తరగతి చదివే బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం... విజయ నగరం జిల్లా గాదెలవలసలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.

విజయనగరంలో కీచక పర్వం : టెన్త్ బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య
, ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (08:57 IST)
విజయనగరం జిల్లాలో కీచక పర్వం జరిగింది. ఓ పదో తరగతి చదివే బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం... విజయ నగరం జిల్లా గాదెలవలసలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన మిరియాల ఇందు సీతానగరం మండలంలోని గాదెలవలసలో టెన్త్ క్లాస్ చదువుతోంది. గత శుక్రవారం పాఠశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం భోజనం చేసేందుకు సైకిల్‌పై ఇంటికివెళ్లింది. తిరిగి పాఠశాలకు వస్తుండగా మార్గంమధ్యలో గాదెలవలసలోని వైన్‌షాపు సమీపంలో పోతల శంకరరావు ఆమెను అడ్డుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆమె వెనుకనే వచ్చి.. గాదెలవలస, బడేవలస మధ్యన ఉన్న మామిడితోటలోకి బలవంతంగా లాక్కెళ్ళాడు. అక్కడకు తన స్నేహితులు సొంగల లోకేశ్, చుక్క రాంబాబు, కోదేటి రవితేజలను పిలిపించి, వారంతా కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు ఎక్కడ చెబుతుందోనని గొంతునులిమి హత్యచేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్కూల్‌ నుంచి కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి గాదెలవలస వచ్చి విచారించారు. 
 
ఇందుతో శంకరరావు మధ్యాహ్నం మాట్లాడినట్లు, ఇందును బెదిరించినట్లు ప్రత్యక్ష సాక్షి పి.అచ్చుత్ వారికి తెలిపారు. గ్రామ పెద్దలతో కలసి శంకరరావును నిలదీయగా.. జరిగిన విషయాన్ని శంకరరావు పెద్దల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇందు మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి తరలించారు. కేసు నమోదు చేసి నలుగురు కామాందులను పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

92 పైసలతో రూ.10 లక్షల బీమా... ఎక్కడ?