Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళం

Advertiesment
battery autos
తిరుమల శ్రీవారికి ఐదు బ్యాట‌రీ ఆటోలు విరాళంగా అందింది. వేలూరుకు చెందిన ప్రముఖ బ్యాటరీ ఆటోల తయారీ సంస్థ వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ మరియు ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్లు కలిసి ఈ మేరకు దాదాపు రూ.15 ల‌క్ష‌ల‌ విలువైన ఐదు బ్యాటరీ ఆటోలను అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాతలు వి.ఎస్.ఎల్. ఇండస్ట్రీస్ ఎం.డి. జి.ఏ. హరికృష్ణ, ఆకెళ్ళ రాఘవేంద్ర ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ ఇంచార్జ్ డెప్యూటీ ఈవో వెంకటయ్యకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల రవాణా విభాగం డి.ఐ. మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మూడు ఆటోలను కోవిడ్ -19 శానిటేషన్ కోసము, రెండు ఆటోలు తిరుమలలో వ్యర్ధాలను తరలించడానికి  ప్రత్యేకంగా రూపొందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక చాయ్ పొయ్... చూద్దాం : మంత్రి హరీష్ రావు