బాలికపై మారుతండ్రి అత్యాచారం..పాలలో నిద్రమాత్రలు కలిపి..ఆపై?
వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో చోటుచేసుకుంది. ఆ వివరా
వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. సిర్రారాజు అనే వ్యక్తికి పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. అతను వృత్తి రీత్యా హోటల్లో పనిచేస్తున్నాడు. అదే హోటల్లో పనిచేస్తున్న కెల్లాలక్ష్మీ అనే మహిళతో పరిచయం పెంచుకొని భార్యతో కలిపి సహజీవనం చేస్తున్నాడు.
లక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరినీ హాస్టల్లో చేర్పించిన సిర్రారాజు, భార్యను, కెల్లలక్ష్మిని ఉపాధి నిమిత్తం గల్ఫ్కి పంపాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో లక్ష్మి గల్ప్కి వెళ్తూ కుమార్తెను హాస్టల్కు పంపకుండా సిర్రారాజు వద్దే ఉంచింది. దీంతో సిర్రారాజు బాలికపై కన్నేశాడు. బాలికను ఎలాగైనా వశపరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బాలికకు పాలలో నిద్రమాత్రలు కలిపి రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
గత పదిరోజులు నుంచి నిద్రమాత్రలు లేకుండా అత్యాచారానికి పాల్పడుతూ.. ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. దీనికి భయపడి ఈ విషయాన్ని బాలిక ఎవరితోను చెప్పలేదు. బాలికలో వచ్చిన మార్పును గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు ఆ బాలికను నిలదీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో గల్ఫ్లో ఉన్న తల్లికి ఉపాధ్యాయులు సమాచారం అందించారు. బాలిక తల్లి పాలకొల్లులో ఉన్న తన బంధువులకు ఫోన్చేసి కుమార్తె విషయం చెప్పి కాపాడమని వేడుకుంది. దాంతో బాలిక బంధువు చల్లా నాగరాజు మలికిపురం పోలీసుస్టేషన్లో ఆ కామాంధుడి గురించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కామాంధుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.