Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. రూ.2.40 లక్షలు స్వాహా

Advertiesment
cyber hackers
, శనివారం, 16 ఏప్రియల్ 2022 (11:01 IST)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ ఖాతాలు సృష్టిస్తూ లక్షల్లో కొట్టేస్తున్నారు. తాజాగా ఏకంగా కలెక్టర్ పేరుపైనే నకిలీ వాట్సాప్ ఖాతాను సృష్టించిన ఓ సైబర్ నేరగాడు.. రూ. 2.40లక్షలు నగదు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట కలెక్టర్ హరిచందన పేరు, ఆమె ఫొటోతో సైబర్ నేరగాడు నకిలీ వాట్సప్ ఖాతాను సృష్టించాడు. 
 
ఈ వాట్సప్ ఖాతా నుండి పలువురి అధికారులకు, ప్రముఖులకు.. తాను సమావేశంలో ఉన్నానని, ఒక వస్తువు వెంటనే కొనుగోలు చేసేందుకు నగదు కావాలంటూ మెస్సేజ్ చేశాడు. 
 
ఈ మెస్సేజ్ చూసిన జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మూడు విడతలుగా రూ. 2.40 లక్షలు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాట్సాప్‌లో మెస్సేజ్ ఇచ్చింది కలెక్టర్ కాదని, సైబర్ నేరగాడు అని పోలీసులు తేల్చారు. సదరు వ్యక్తి ఝార్ఖండ్ కు చెందిన వాడని గుర్తించామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం జగన్