Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కసి చల్లారకుంటే మర్మాంగంపై సూదులతో పొడుస్తాడు: నయీం దుశ్చర్యలపై మాజీ నక్సలైట్

ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీం కారణంగా తీవ్రంగా నష్టపోయిన, చిత్రహింసలకు గురైన మాజీ నక్సలైట్లు ఒక్కొక్కరుగా మీడియా

Advertiesment
కసి చల్లారకుంటే మర్మాంగంపై సూదులతో పొడుస్తాడు: నయీం దుశ్చర్యలపై మాజీ నక్సలైట్
, గురువారం, 11 ఆగస్టు 2016 (12:19 IST)
ఇటీవల పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నయీం కారణంగా తీవ్రంగా నష్టపోయిన, చిత్రహింసలకు గురైన మాజీ నక్సలైట్లు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా మావోయిస్టులను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన ఓ మాజీ నక్సలైట్... నయీం చేతిలో ఏ విధంగా వేధింపులకు గురైంది పూసగుచ్చినట్టు వివరిస్తున్నాడు. 
 
తన మాట వినని వారి పట్ల నయీం ఏ విధంగా ప్రవర్తిస్తాడో వివరించాడు. 'ముందు ప్యాంటు విప్పించి పిరుదుల మీద గుండుసూదులతో గుచ్చుతాడు. బంగారం, ఇనుము నమిలిస్తాడు. తీవ్రంగా కొట్టి తర్వాత ఓ పదివేలు ఇచ్చి వైద్యం చేయించుకోమంటూ ఇంటికి పంపిస్తాడు. తన కసి చల్లారకపోతే మార్మాంగంపైనా సూదులతో పొడుస్తాడు. ఆపై కారం చల్లిపిస్తాడు' అని ఓ మాజీ నక్సలైట్‌ చెప్పాడు. 
 
ఏ హోదా నాయకుడు లొంగిపొయినా విధిగా తనను కలవాలని కోరుకోవడం వెనుక నయీం అభద్రతా భావమే కారణం అంటారు. వారు ఎదిగి తనకు స్పాట్‌ పెడుతారన్నదే అసలు భయం అని చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామరక్షక దళం వ్యక్తి 'నయీమ్‌ ఎవరు? ఏం పీకుతాడు?' అన్నాడన్న విషయం తెలిసింది. అంతే.. రెండు రోజుల్లో అతణ్ని పట్టుకొని మర్మాంగాలు కొసి జేబులో పెట్టారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నయీం కౌన్' అన్నారో డెత్‌ కౌంటర్.. లొంగిపోయిన వెంటనే గ్యాంగ్‌లో చేరాలి... ఇదీ మాజీ నక్సల్స్ పరిస్థితి