Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి (54) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం పరిస్థిత

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య గుండెపోటుతో మృతి
, మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:04 IST)
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భార్య పద్మావతి (54) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. 
 
ఆమె తుదిశ్వాస విడిచే సమయంలో భర్త కొణతాలతో పాటు.. సంతానం, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పద్మావతి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, ఫోన్‌లో కొణతాలను పరామర్శించారు. ఆపై ఆయన ఇంటి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర సాగగా, కొణతాల అంతిమ సంస్కారం జరిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టం లేని పెళ్ళి.. ఫోన్‌లో మాటలే మాటలు.. భర్తనే చంపేసిన భర్త.. ఎక్కడ?