Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇబ్రహీం మహోన్నత త్యాగమే #EidMubarak : నేతల శుభాకాంక్షలు

ఇబ్రహీం మహోన్నత త్యాగమే #EidMubarak : నేతల శుభాకాంక్షలు
, బుధవారం, 21 జులై 2021 (09:42 IST)
ముస్లీం సోదరులు జరుపుకునే పవిత్రమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగను బుధవారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ముఖ్యంగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు. 
 
విశ్వాసానికి, క‌రుణ‌, ఐక్య‌త‌కు ప్ర‌తీక బ‌క్రీద్‌. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ శుభాకాంక్ష‌లు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ప్రార్ధిస్తున్నాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో కుమార్తెపై ఆర్నెల్లుగా తండ్రి అత్యాచారం