Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం..

railway track
, గురువారం, 30 మార్చి 2023 (13:31 IST)
ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దూరంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది.
 
గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్.. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Xiaomi Redmi Note 12 Turbo విడుదల