Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు వివరాలు వెల్లడించిన డిఎస్పీ బి శ్రీనివాసులు

భార్యను హత్య చేసిన భర్త అరెస్టు వివరాలు వెల్లడించిన డిఎస్పీ బి శ్రీనివాసులు
, సోమవారం, 14 జూన్ 2021 (19:33 IST)
కృష్ణా జిల్లా: విస్సన్నపేట మండలంలోని కొర్ర తండా లో అనుమానంతో భార్య హత్య చేసిన భర్త కొర్ర దుర్గారావును అరెస్టు చేసినట్లు నూజివీడు డి.ఎస్.పి బి శ్రీనివాసులు విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. కేసు పూర్వాపరాలను ఆయన తెలియజేస్తూ నిందితుడు మండలంలోని కొర్ర తండాకు చెందిన వాడని రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి చెందిన ధారావత్ కాశీ రెండవ కుమార్తె లక్ష్మీని సంవత్సరం క్రితం  వివాహం చేసుకున్నట్లు తెలియజేశారు.

వారికి పిల్లలు కలగలేదని  6 నెలల క్రితం నుండి అనుమానంతో గొడవలు జరుగుతున్నాయని ఈనెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొంతు నొప్పి చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దూలానికి ఉరి వేసుకున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు .

మండల తాసిల్దార్ బి మురళీకృష్ణ ఎదుట లొంగి పోయినట్లు చెప్పారు. అతను వాంగ్మూలం నమోదు చేసి సోమవారం రిమాండ్ నిమిత్తం  కోర్టుకు తరలించారు.ఈ కార్యక్రమంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు విస్సన్నపేట ఎస్ఐ పరిమి కిషోర్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్‌ వాహనమిత్ర: రూ.248.46 కోట్లు కేటాయింపు