Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్ - తిరుపతి వయా విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్.. అత్యాధునిక సౌకర్యాలతో...

వైజాగ్ - తిరుపతి వయా విజయవాడ డబుల్ డెక్కర్ ట్రైన్.. అత్యాధునిక సౌకర్యాలతో...
, శనివారం, 25 జూన్ 2016 (12:40 IST)
సముద్రతీర ప్రాంతం వైజాగ్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వయా విజయవాడ మీదుగా డబుల్ డెక్కర్ రైలు నడుపనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ రైలును వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని చర్యలు తీసుకుంది. కాగా, ఈ డబుల్ డెక్కర్ రైలులో ఉండే సౌకర్యాలను ఓసారి పరిశీద్ధాం. 
 
మొత్తం పది కోచ్‌లతో కూడిన ఈ రైలు.. పూర్తిగా ఏసీ సౌకర్యంతో ఉంటుంది. ప్రతి బోగీలో 120 సీట్లు ఉంటాయి. ప్రతి టాప్ కోచ్‌లో 70 సీట్లు ఉంటాయి. ఇవన్నీ సెమీ స్ట్రెచ్చబుల్‌. ఇందులో అలారం వ్యవస్థతో కూడిన ఫైర్ డిటెక్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే, 12 అత్యవసర ద్వారాలు ఉన్నాయి. 
 
అలాగే, ప్రతి బోగీలోను సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే అంశాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, 2011 అక్టోబరు నెలలో హౌరా - ధన్‌బాద్‌ల మధ్య తొలి డబుల్ డెక్కర్ రైలును నడిపారు. ఆ తర్వాత ఇతర రూట్లలో దశలవారీగా రైల్వే శాఖ నడుపుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ మోహన్ రెడ్డి కూల్‌గా ఏంటీ ఈ ఆటలు...? చెల‌రేగి చెస్ ఆడేస్తున్న జ‌గ‌న్(ఫోటోలు)