Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి కొత్త కంపెనీలు రావు: దేవినేని ఉమ

ఏపీకి కొత్త కంపెనీలు రావు: దేవినేని ఉమ
, శనివారం, 26 జూన్ 2021 (20:06 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు సర్కారు తీరుతో ఏపీకి గుడ్‌ బై చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఉన్నవన్నీ వెళ్లిపోతున్నాయనీ.. కొత్త కంపెనీలు రావని తెలిపారు. ‘‘ సర్కార్ తీరుతో చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు వెనక్కి. ఏపీకి గుడ్ బై. కొత్త కంపెనీలు రావు. ఉన్నవీ వెళ్లిపోతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలూ లేవు. అభివృద్ధి, సంపద సృష్టి సున్నా. లక్షల కోట్ల అప్పులు. ఒక్క ఛాన్స్ అడిగింది పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి తరలించడానికా జగన్?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎస్‌ పదవీకాలం మూడు నెలలు పొడిగింపు