Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నల్ల కుబేరులకు బంపర్ ఆఫర్... హుండీలో వేయండి... నల్లను తెల్ల చేస్కోండి... రూ.1500 కోట్లు

నల్లధనం ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉన్నదో తెలుసుకుని మరీ నల్ల కుబేరుల ముందు కొందరు వాలిపోతున్నారు. ముఖ్యంగా నల్లధనం కట్టలు కట్టలు నేల మాళిగల్లో పెట్టేసుకుని ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నవారికి హవాలా, హుండీ పెద్దలు రంగంలోకి దిగి 60:40 నిష్పత్తిలో ఆదుకు

నల్ల కుబేరులకు బంపర్ ఆఫర్... హుండీలో వేయండి... నల్లను తెల్ల చేస్కోండి... రూ.1500 కోట్లు
, ఆదివారం, 20 నవంబరు 2016 (22:05 IST)
నల్లధనం ఎవరి దగ్గర ఉందో ఎక్కడ ఉన్నదో తెలుసుకుని మరీ నల్ల కుబేరుల ముందు కొందరు వాలిపోతున్నారు. ముఖ్యంగా నల్లధనం కట్టలు కట్టలు నేల మాళిగల్లో పెట్టేసుకుని ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉన్నవారికి హవాలా, హుండీ పెద్దలు రంగంలోకి దిగి 60:40 నిష్పత్తిలో ఆదుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ మార్గాల ద్వారా ఇప్పటికే రూ. 1500 కోట్ల నల్లధనం తెల్లధనంగా మారిపోయిందని సమాచారం. 
 
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో హుండీ, హవాలా రాయుళ్లు తిష్టవేసి నల్లధనం పోగుచేసుకున్న కుబేరుల వద్దకు వెళ్లి ప్రణాళికలు చెపుతున్నారట. ఆ ప్రకారంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ఉన్న హుండీల్లో నల్లధనాన్ని కానుకలుగా సమర్పించేస్తున్నారట. హుండీ డబ్బు నల్లధనం అయినా లెక్క ఉండదు కాబట్టి ఎంచక్కా అది తెల్లధనంగా మారిపోతుంది. కాకపోతే ఇక్కడ నిష్పత్తి ప్రకారం మాట్లాడుకుని హుండీల్లా వేయించేస్తున్నారట. 
 
ఇంకో మార్గం డాలర్లు కొనేయడం. ఆ డబ్బును హవాలా మార్గం ద్వారా నడించేయడం. ఇలా మొత్తమ్మీద నల్ల కుబేరులు ఎక్కడ కూడా తగ్గకుండా నల్లధనాన్ని 100 పర్సెంట్ తెల్లధనంగా మార్చేసుకుంటున్నట్లు సమాచారం వస్తోంది. మరి ఈ హుండీ, హవాలా మార్గాలను నరేంద్ర మోదీ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లధనం జమ చేస్తే జన్‌ధన్ బ్యాంకు ఖాతాదారులకు చిక్కులే: కేంద్రం వార్నింగ్