Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు

14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు
, గురువారం, 13 ఆగస్టు 2020 (23:12 IST)
శ్రీశైల దేవస్థానంలో ఆగస్టు 14 నుండి దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5.30 గంటల నుండి7.30 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు.

దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అలాగే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగం: మంత్రి బొత్స