Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాపట్ల వద్ద తీరం దాటిన మిచౌంగ్ పెనుతుఫాన్, కోస్తాంధ్రలో దంచికొడుతున్న భారీ వర్షాలు

Advertiesment
Rain
, మంగళవారం, 5 డిశెంబరు 2023 (17:13 IST)
బాపట్ల జిల్లా సూర్యలంక తీరం వద్ద మిచౌంగ్ పెనుతుఫాను తీరాన్ని పూర్తిగా దాటింది. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తీరాన్ని తాకిన పెనుతుఫాన్, పూర్తిగా తీరాన్ని దాటేందుకు రెండు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం రెండున్నరకు తీరాన్ని పూర్తిగా దాటింది. దీని ప్రభావంతో బాపట్ల తీరం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
 
తీరం దాటిన తుఫాను ప్రస్తుతం బాపట్లకి 15 కి.మీ దూరంలోనూ ఒంగోలుకి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పెనుతుఫాన్ ఉత్తర దిశగా ప్రయాణం చేసి క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. మరోవైపు దీని ప్రభావంతో పశ్చిమ ఆంధ్ర, దక్షణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు... కడియం శ్రీహరి