Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిచౌంగ్ తుఫాను- రెడ్ అలెర్ట్- యువగళం పాదయాత్రకు బ్రేక్

nara lokesh
, సోమవారం, 4 డిశెంబరు 2023 (10:08 IST)
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఏపీలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ యువగళం పాదయాత్ర ఆగిన చోటు నుంచే అంటే శీలంవారిపాకల నుంచే ప్రారంభం కానుంది.  ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు పాదయాత్ర చేరుకుంది. 
 
కాగా నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుఫాను సోమవారం తీవ్ర తుపానుగా బలపడనుంది. సోమవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మిచౌంగ్' తుపాను.. తమిళనాడులో భారీ వర్షాలు