Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

Advertiesment
COVID-19
, శుక్రవారం, 27 మార్చి 2020 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజ‌య‌వాడ‌కు చెందిన 28 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అలాగే, వైజాగ్‌లో మరో కేసు వెలుగు చూసింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కి చేరింది. 
 
ఈ నెల 18న స్వీడ‌న్ నుంచి వ‌చ్చిన అత‌డు ఢిల్లీ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో విజ‌య‌వాడ జీజీహెచ్‌లో చేరాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌ శాఖ ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేసింది. 
 
అలాగే, విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బర్మింగ్‌హమ్‌ నుంచి వచ్చిన వ్యక్తితో లోకల్‌ కాంటాక్ట్‌ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
ఈనెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని 21న ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చేరారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి నెగిటివ్‌ రాగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరోగ్యంగా ఉన్నవారిని అనుమతించాలి : ఏపీ సర్కారుకు హైకోర్టు