Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ చైర్మన్ కి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు

Advertiesment
టీటీడీ చైర్మన్ కి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు
, సోమవారం, 1 జూన్ 2020 (20:47 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఆస్తులను విక్రయించరాదని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వై .వి. సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశ్వధర్మపరిరక్షణ వేదిక సభ్యులు అభినందించారు. 
 
సోమవారం తాడేపల్లిలోని వై.వి.సుబ్బారెడ్డి నివాసంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలోని విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు సుబ్బారెడ్డిని కలిశారు.
 
టీటీడీ విషయంలో అద్భుతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ రజిత కిరీటంతో ఘనంగా సన్మానించారు. 

వైయస్సార్సీపి ప్రభుత్వం హిందూ ధర్మానికి అండగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సుబ్బారెడ్డిని సన్మానించిన వారిలో శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, యోగేశ్వర నంద స్వామి, ఆది పరాశక్తి నంద స్వామి, భవాని శంకరానంద స్వామి, హరి నంద స్వామి తదితరులున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ద్యావుడా, కరోనాను మించిన అపాయం చిత్తూరు జిల్లాకు వచ్చింది, ఏంటది?