Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో ఏటీఎంలు క్లోజ్‌ - శ్రీవారి భక్తుల నుంచి పెద్దనోట్లకు కమిషన్‌

తిరుపతిలో ఏటీఎం కేంద్రాలు మూడో రోజైన శుక్రవారం కూడా తెరుచుకోలేదు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద ఉన్న ఏటీఎంలు పూర్తిగా మూసివేయడంతో శ్రీవారి భక్తులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్ర

Advertiesment
Commission Currency Exchange
, శుక్రవారం, 11 నవంబరు 2016 (13:55 IST)
తిరుపతిలో ఏటీఎం కేంద్రాలు మూడో రోజైన శుక్రవారం కూడా తెరుచుకోలేదు. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ వద్ద ఉన్న ఏటీఎంలు పూర్తిగా మూసివేయడంతో శ్రీవారి భక్తులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ షాపుల యజమానులు ఇదే అదునుగా పెద్ద నోట్లకు భక్తుల నుంచే కమిషన్లను దండుకుంటున్నారు. 
 
500 రూపాయల నోట్లపై 75 రూపాయల కమిషన్‌, వెయ్యిరూపాయల నోట్లకు 150 రూపాయల కమిషన్‌ను భక్తుల నుంచి ప్రైవేటు షాపు యజమానులు దండుకుంటున్నారు. ఇక చేసేది లేక, తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోలేక ప్రైవేటు హోటల్‌ యజమానులకు పెద్ద నోట్లను భక్తులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. గత మూడురోజులుగా ఎటిఎం కేంద్రాలు లేకపోవడంతో తిరుమలకు వచ్చిన శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో పాఠశాలలకు ఉపాధ్యాయులు కావలెను...!