Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగనన్న విద్యా దీవెన పథకం.. బటన్ నొక్కి జమ చేసిన జగన్

jagan
, బుధవారం, 24 మే 2023 (13:28 IST)
విద్యార్థులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేశారు. పేద పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
 
అర్హులైన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తోంది. మెడిసిన్, డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు రూ.20 వేలు, ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు ఖాతాల్లో జగన్ సర్కారు జమ చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలిక వివాహం.. రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి..?