ఆదర్శ పాఠశాలలో కీచక టీచర్.. విద్యార్థులకు నీలి చిత్రాలు చూపించి పాఠాలు...
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిలా మారిపోయాడు. సహచర ఉపాధ్యాయురాళ్లతో పాటు 10 తరగతి విద్యార్థినులను వేధింపులను కూడా లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాజాగా వెలుగులోకి వ
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిలా మారిపోయాడు. సహచర ఉపాధ్యాయురాళ్లతో పాటు 10 తరగతి విద్యార్థినులను వేధింపులను కూడా లైంగిక వేధింపులకు గురిచేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తారు...
తెలంగాణ రాష్ట్రంలోని జగదేవ్పూర్ ఆదర్శ పాఠశాల ఉంది. పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు మహిళా టీచర్ల దినచర్యను తన సెల్ఫోన్లో రహస్యంగా వీడియో చిత్రీకరిస్తూ వచ్చాడు. భోజనం చేస్తున్నప్పుడు, పాఠశాల ఆవరణలో తిరుగుతున్నప్పుడు, స్టాఫ్రూమ్లో మహిళా టీచర్లను వీడియో తీస్తున్నాడు. అతడి చేష్టలు భరించలేని 11 మంది మహిళా టీచర్లు ఈ నెల 8న పాఠశాల ప్రిన్సిపాల్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ కీచకుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తానంటూ ప్రిన్సిపాల్ను బెదిరించాడు. దీంతో మహిళా టీచర్ల ఫిర్యాదు పాఠశాల గడప దాటలేదు. అతడు విద్యార్థులకు సెల్ఫోన్లో ఇంటర్నెట్ ఆన్చేసి నీలి చిత్రాలు చూపిస్తున్నాడని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. పదో తరగతి విద్యార్థినుల పట్ల కూడా అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.