Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)

చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాల

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)
, గురువారం, 29 జూన్ 2017 (16:55 IST)
చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ పథకాల పట్ల దళితుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఆ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నారు. 
 
అవగాహన కల్పించాల్సిన అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండటంతో లబ్ది పొందే ఛాన్స్‌ను దళితులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు శివప్రసాద్. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫైరయ్యారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారిత సదస్సులో ఎంపి శివప్రసాద్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రంలో 3 ఎన్.సి.సి అకాడమీలు... సి సర్టిఫికెట్ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యం