Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
, మంగళవారం, 4 జులై 2017 (07:27 IST)
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌ ఫారమ్‌లో సోమవారం ఉదయం ఓ చిరుత అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ స్తంభం వద్దకు వచ్చింది. ఆ తర్వాత దీనికి ఏం కనిపించిందో ఏమోగానీ, చకచకా కరెంట్ స్తంభమెక్కింది. 
 
ఆసమయంలో విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంటు షాక్‌ కొట్టి అక్కడే చనిపోయింది. అడవిలోకి వెళ్లిన స్థానికులు ఆ చిరుతను గమనించి సర్పంచ్‌కు, అటవీ అధికారులకు సమాచారమిచ్చి చిరుత కళేబరాన్ని కిందకు దించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతనితో భార్య సన్నిహితంగా ఉంటుందనీ... భర్త సూసైడ్