Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తాం: చంద్రబాబు హెచ్చరిక

Advertiesment
Chandrababu
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:18 IST)
చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆగడాలు మరీ మితిమీరి పోతున్నాయని, పిచ్చిపిచ్చి వేషాలు వస్తే తోకలు కత్తిరిస్తామని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలతో జరిగిన ఆన్లైన్ చంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ...  ‘సొంత మద్యం బ్రాండ్లు పెట్టుకుని ఇష్టానుసారం రేట్లు పెంచి.. వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకను బ్లాక్‌ చేసి ఆదాయ మార్గంగా మలుచుకున్నారు. ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.

ఇళ్లస్థలాల పేరుతో భూములు కొనుగోలు చేసి వందల కోట్లు గడించారు. దౌర్జన్యంగా ఇతరుల నుంచి గనులు లాక్కుంటున్నారు. ఆ పార్టీ వారు తప్ప ఇతరులు టెండర్లు వేసే పరిస్థితి లేదు. ప్రతి పనికీ కమీషన్లు.. ప్రతి పనిలో వాటాలు ఈ ప్రభుత్వ విధానంగా మారిపోయాయి’ అని విరుచుకుపడ్డారు.

ఒక ప్రభుత్వం 16నెలల్లోనే ఇంత ఘోరమైన అవినీతికి పాల్పడడం చరిత్రలో లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ నేతలు ఆ బురదను టీడీపీపై చల్లి తప్పించుకోవాలని చూస్తున్నారని, టీడీపీ పాలనపై అవినీతిముద్ర వేయడానికి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ నేత ఫిర్యాదు చేశాడని.. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక సహా భూక్యా కుటుంబీకులను చిల్లకల్లు పోలీసు స్టేషన్‌లో నిర్భంధించడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆ చిన్నారిలో మీకు ఏ నేరస్థుడు కన్పించాడని ట్విటర్‌లో ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో భారత్‌కి 10 కోట్ల డోసుల రష్యా వ్యాక్సిన్‌ .. 30 కోట్ల డోసుల ఉత్పత్తికి ఒప్పందాలు