Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులలో చూసుకుంటారు... రోజా(Video)

తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామి వారి కైంకర్యాలలో నిమగ్నం అయ్యే అర్చక

వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులలో చూసుకుంటారు... రోజా(Video)
, బుధవారం, 1 ఆగస్టు 2018 (19:28 IST)
తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామి వారి కైంకర్యాలలో నిమగ్నం అయ్యే అర్చక స్వాములకు రిటైర్మెంట్ ఎలా చేస్తారు అని టీటీడీ పాలకమండలి రోజా ప్రశ్నిచారు. 
 
సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారిని రమణదీక్షితులలో చూసుకుంటారనీ, అలాంటి రణమదీక్షితులను విధుల నుంచి తొలగించిన విధానం చాలా బాధాకరం అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనాన్ని రద్దుకు ఆమోదం తెలిపిన పాలకమండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వనికి రోజా సూచించారు. శ్రీవారి ఆభరణాల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని జేఈవో వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆభరణాలను ఆన్లైన్‌లో పెడతాం అన్నారు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయినా ఆభరణాల ఆన్లైన్ పైన జేఈవో స్పందించక పోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తుందని రోజా విమర్శించారు.
 
గిరిజన శాఖ మంత్రి లేకపోవడంతోనే దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రజలపై చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని రోజా మండిపడ్డారు. ఈ రోజు స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, కోన రఘుపతి, సురేష్... ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. చూడండి ఎమ్మెల్యే రోజా మాటల్లోనే... వీడియో...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ గుట్టు రట్టు.. ఉద్యోగాల పేరిట యువతులను?