Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు కుప్పం టూర్!: మూడు రోజుల పాటు..?

చంద్రబాబు కుప్పం టూర్!: మూడు రోజుల పాటు..?
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:38 IST)
ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకర్గంలో పర్యటిస్తారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కుప్పంలో ఆయన పర్యటన వుంటుంది. ఇందులో భాగంగా 12న విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన కోలారు, కేజీఎఫ్‌, బంగారుపేట మీదుగా రాళ్లబూదుగూరుకు చేరుకుంటారు. 
 
కుప్పం ఆర్టీసీ బస్టాండులో మధ్యాహ్నం 1.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు. 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటిస్తారు. ఇక 14న గుడుపల్లె సభలో పాల్గొని.., సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని బెంగళూరు మీదుగా విజయవాడకు ప్రయాణమవుతారు. 
 
ఇకపోతే.. 1989 నుంచి 2019 ఎన్నికల వరకు చంద్రబాబు కుప్పంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇక్కడ చంద్రబాబు మాటే సాగుతుంది. అయితే 2019 ఎన్నికల అనంతరం కుప్పంలో క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. ఎలాంటి ఎన్నికలైనా కుప్పంలో టీడీపీదే పైచేయి. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 
 
పంచాయితీ ఎన్నికల నుంచి ఎంపీపీ ఎన్నికల కుప్పంలో టీడీపీకి ఘోరమైన ఓటమి తప్పలేదు. పార్టీ పోటీలో ఉన్న లేకున్నా టీడీపీ బలపరిచిన అభ్యర్థినే అధిక శాతం గెలిపించుకోవడం కుప్పం ప్రజల ఆనవాయితీ. కానీ గత రెండున్నరేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న సినీ న‌టి శ్రీయ‌