Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం

సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం
, గురువారం, 11 నవంబరు 2021 (11:01 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది.

చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.

అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుపాను తీరం దాటనుంది.

అంతకు ముందు 2008 నవంబర్‌ 13న నెల్లూరు వద్ద తుపాను తీరాన్ని దాటింది. వాతావరణశాఖ తెలిపిన మేరకు..గురు, శుక్రవారాల్లో కోస్తా,రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, కురుస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 13,091 కరోనా కొత్త కేసులు