Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్ల రద్దు.. కోపంతో రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన కానిస్టేబుల్..

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు

Advertiesment
CC Footage
, శనివారం, 19 నవంబరు 2016 (17:26 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో నగదు రాలేదన్న కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం రాత్రి విశాఖ జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎం మాత్రమే ఉంది. 
 
రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్‌ కొద్దిసేపు వరుసలో నిలబడ్డాడు. అతని వంతు వచ్చే సరికి ఏటీఎమ్ మిషీన్ పనిచేయలేదు. దీంతో కానిస్టేబుల్‌కి పట్టలేని కోపం వచ్చింది.

అంతే కోపాన్ని ఏ మాత్రం ఆపుకోలేక ఏటీఎం మిషీన్‌ను నాలుగైదు సార్లు కాలితో తన్నాడు. అయినా కోపం ఏమాత్రం తగ్గకపోవడంతో మళ్లీ యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దీంతో ఆ రెండు ఏటీఎంలూ ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పాడేరు బ్యాంకు సిబ్బంది ఏటీఎం కేంద్రానికి తాళం వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కడ చూసినా డబ్బే డబ్బు... దేశ వ్యాప్తంగా బయటపడుతున్న లక్ష‌ల కొద్దీ పాత‌నోట్లు