Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Guntur Mirchi Yard: గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన.. జగన్‌పై కేసు నమోదు

Advertiesment
Jagan

సెల్వి

, గురువారం, 20 ఫిబ్రవరి 2025 (09:46 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలులో ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా కలెక్టర్ పర్యటనకు వ్యతిరేకంగా ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ, జగన్ మిర్చి యార్డ్‌లోనే కార్యక్రమాన్ని కొనసాగించారు.
 
దీని తరువాత, గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లెల్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్‌లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆరోపించారు.
 
ఎన్నికల కోడ్‌ను అమలు చేయడాన్ని కుట్రగా వైసీపీ చెబుతోంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు… ప్రచారం చేయట్లేదు.. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని వాదిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో మరో జీబీఎస్ మరణం... మహమ్మారి కాదు.. కాళ్లలో తిమ్మిరి వస్తే?