Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదాకు జేఏసీ ఏర్పాటు చేయండి : పవన్ కల్యాణ్‌ను కోరిన సి.రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశాని ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని స్పందించారు.

ప్రత్యేక హోదాకు జేఏసీ ఏర్పాటు చేయండి : పవన్ కల్యాణ్‌ను కోరిన సి.రామచంద్రయ్య
, ఆదివారం, 28 ఆగస్టు 2016 (14:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశాని ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని స్పందించారు. దీంతో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ సభలో కాంగ్రెస్, బీజేపీలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత సి రామచంద్రయ్య స్పందించారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ గళం విప్పడాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ చేసే ఎలాంటి పోరాటానికైనా తాము మద్దతు తెలపనున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
అంతేకాకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతున్న పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నింటినీ ఒక్కదరికి చేర్చి ‘ఐక్య కార్యాచరణ కూటమి (జేఏసీ)’ని ఏర్పాటు చేసి, దానికి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించాలని కోరారు. హోదా విషయంలో బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నంత స్థాయిలో టీడీపీపై పవన్ స్పందించలేదని రామచంద్రయ్య ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వాన్ని చంపేసిన కండక్టర్... బస్సులో చనిపోయిన మహిళ.. వర్షం పడుతున్నా కిందికి తోసేశాడు