Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్ కు సీఎం జ‌గ‌న్ జ్ఞాపిక

Advertiesment
britan
విజయవాడ , మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:26 IST)
బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్ బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది.

బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, ఇత‌ర బృంద సభ్యులు సీఎంను క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్‌ టీంను సీఎం వైఎస్‌ జగన్ కోరారు.

ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎంకి బ్రిటన్ బృందం వివ‌రించింది. ఈ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చాలా అనుకూల‌మైన‌ద‌ని, ప్ర‌భుత్వ స‌హ‌కారం కూడా ఎంతో ఉంటుంద‌ని సీఎం వారికి తెలిపారు.

బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌.సన్మానించి, జ్ఞాపికను అందజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

48 గంటల్లోగా నేరచిట్టాను విప్పాలి.. పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశం