Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిమెంట్ బెంచ్‌పై కూర్చుని ఆడుతూ.. చిన్నారి అలా పడిపోయాడు.. చివరికి?

Advertiesment
Boy
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (15:04 IST)
వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు సాయంత్రం పూట హాయిగా పార్కులకు చేరుకుంటున్నారు. అయితే పిల్లలు పార్కుల్లో ఆడుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు అలా వదిలేస్తుంటారు. అలాంటి వారికి ఈ ఘటన అప్రమత్తంగా వుండాలని చెప్తోంది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే? ఇటీవల ఆడుకుంటూ రోడ్డు పక్కనే వున్న కరెంట్ స్తంభం పట్టుకుని చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా పార్కులో సిమెంట్ బెంచ్‌పై కూర్చొని ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రాజేంద్రనగర్ హైదర్ గూడ‌లో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ప్లే గ్రౌండ్ ఉంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నిశాంత్ శర్మ బాలుడు సిమెంట్ బెంచ్‌పై కూర్చొన్నాడు. దానిని అటూ..ఇటూ..కదుపుతున్నాడు. ఒక్కసారిగా సిమెంట్ బెంచ్ బోల్తా పడింది. దాని కింద నిశాంత్ చిక్కుకపోయాడు. వెంటనే అక్కుడున్న వారు సిమెంట్ బెంచ్‌ని పైకి లేపారు. తలకు తీవ్ర గాయం కావడంతో నిశాంత్ చనిపోయాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న నిశాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. విరిగిపోయిన సిమెంట్ బెంచ్ ఉంచడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాలుడి తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. పార్క్ నిర్వాహణ సరిగ్గా లేదని అపార్ట్‌మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నా... అసలే డబ్బుల్లేవ్... ఎందుకు తాగొచ్చావ్ అన్నందుకు, ఉరి వేసి...