Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంధువని పలకరిస్తే పెళ్లన్నాడు.. నో చెప్పడంతో.. ఇంటికొచ్చి గొంతుకోసేశాడు.. ఎక్కడ?

బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తరచూ ఆమెను కలిశాడు. ఏదో బంధువే కదా అని ఆమె కూడా పలకరించింది. అయితే పెళ్లి మాటెత్తాక ఆమె ససేమిరా అంది. ఆమె తల్లిదండ్రులూ ఒప్పుకోలేదు. బంధువు కావడంతో పలకరిం

బంధువని పలకరిస్తే పెళ్లన్నాడు.. నో చెప్పడంతో.. ఇంటికొచ్చి గొంతుకోసేశాడు.. ఎక్కడ?
, మంగళవారం, 26 జులై 2016 (14:31 IST)
బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తరచూ ఆమెను కలిశాడు. ఏదో బంధువే కదా అని ఆమె కూడా పలకరించింది. అయితే పెళ్లి మాటెత్తాక ఆమె ససేమిరా అంది. ఆమె తల్లిదండ్రులూ ఒప్పుకోలేదు. బంధువు కావడంతో పలకరించానే తప్ప తనకు ఆ ఐడియా లేదని చెప్పేసింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు అమ్మాయి ఇంటికెళ్లి గొంతు కోసేశాడు. ఈ ఘటన విజయనగరంలోని గాజులరేగలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గాజులరేగకు చెందిన ఓ యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎస్‌.కోటకు చెందిన కుసుమంచి విక్రమ్‌ ఆమెకు దగ్గర బంధువు. ఎంబీఏ పూర్తి చేసి ఊరిలోనే ఉంటున్న విక్రమ్ తరచూ ఆమెను కలిసేవాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని.. పది రోజుల క్రితం తన మేనత్త, సోదరిని గాజులరేగ పంపి యువతి తల్లిదండ్రులతో పెళ్లి సంబంధం ఖాయం చేసుకు రమ్మన్నాడు. కానీ విక్రమ్‌కు తన బిడ్డనివ్వమని యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.
 
దీంతో సోమవారం యువతి ఇంటికి వచ్చిన విక్రమ్ ఆమె తల్లిదండ్రులతో వాదనకు దిగాడు. మాటామాటా పెరిగి చివరకు యువతిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో గొంతు కోసేశాడు. విక్రమ్‌ను అడ్డుకున్నా ప్రయత్నం లేకపోయింది. దీంతో గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పరారైన విక్రమ్‌ను పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా దేశాలు మాకో లెక్క కాదు.... ఖండాలు దాటి కూడా తుక్కుతుక్కు చేస్తాం... అమెరికాకు చైనా వార్నింగ్