Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు జైలుకెళితే సీఎం కుర్చీలో కూర్చునేదెవరు?

వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడ

చంద్రబాబు జైలుకెళితే సీఎం కుర్చీలో కూర్చునేదెవరు?
, శుక్రవారం, 10 మార్చి 2017 (13:51 IST)
వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడి నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ విమర్శిస్తున్నారు. 
 
వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పులాంటివారయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ వివాహం చేసుకున్నాడు.. రూ.17లక్షల జరిమానా విధించిన పాకిస్థాన్ కోర్టు