Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు పార్టీలో 14 మంది నల్లకుబేరులు... రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారట...

రాష్ట్ర విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పదేపదే చెపుతూ వచ్చారు. కానీ, ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు.

Advertiesment
Black Money
, బుధవారం, 16 నవంబరు 2016 (16:15 IST)
రాష్ట్ర విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే సహించేది లేదని పదేపదే చెపుతూ వచ్చారు. కానీ, ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు. అదేసమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్‌కు దిమ్మతిరిగిపోయింది. ప్రధాని మోడీ నిర్ణయం మాత్రం రెండు చేతులా సంపాదించిన పలువురు ఎమ్మెల్యేలకు మైండ్‌బ్లాంక్ అయ్యేలా చేసింది. 
 
ముఖ్యంగా కోస్తాలో ఉన్న ఎమ్మెల్యేల్లో 14 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు తమ వద్ద ఉన్న బ్లాక్‌మనీని ఎలా మార్చుకోవాలో అర్థంకాక తీవ్రంగా మదనపడిపోతున్నారు. బయటకు చెప్పలేరు.. లోపల ఉంచుకోలేరు.. 30 శాతం డబ్బు ఇస్తే.. అంటే కోటి రూపాయలలో రూ.30 లక్షలు ఇస్తే మార్చిపెడతామని ఫోన్‌లు చేస్తున్న హవాలా వ్యాపారుల కోసం కొంతమంది ఎమ్మెల్యేలు వాకబు చేస్తున్నారు. 
 
మరికొంతమంది అనుచరుల ద్వారా బ్యాంకులలో పొలాలు ఉన్న రైతుల పేరుమీద డిపాజిట్లు వేయిస్తున్నారు. ఇలా ఎవరి బాధలు వారు పడుతున్నారు. కానీ ఈ 14 మంది ఎమ్మెల్యేల వద్ద నోట్లకట్టలు మూలుగుతున్నాయన్న సంగతి గూఢచారి వర్గాల ద్వారా చంద్రబాబు వరకూ వెళ్లింది. ఆదాయపు పన్నుశాఖ అధికారులు నిఘా వేస్తారని తెలియడంతో ఆ ఎమ్మెల్యేలు కిక్కురుమనడం లేదు. తొలుత తమ బ్లాక్‌మనీని బంగారు బిస్కెట్ల రూపంలోకి మార్చుదామని ప్రయత్నించినప్పటికీ ఐటీనిఘా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూర్పు కోటీశ్వ‌రుల‌కు... మార్పు సామాన్యులకా? కోట్ల బ‌కాయిల వసూలెపుడు మోదీ గారూ...?