Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ‌హిళ‌ల్ని వేధిస్తున్న ఇద్ద‌రు మంత్రులున్నారు... తొల‌గిస్తారా బాబూ!

తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక

మ‌హిళ‌ల్ని వేధిస్తున్న ఇద్ద‌రు మంత్రులున్నారు... తొల‌గిస్తారా బాబూ!
, శనివారం, 6 ఆగస్టు 2016 (19:29 IST)
తిరుప‌తి: ఏపీ సీఎం చంద్ర‌బాబు అభివృద్ధిలో క‌న్నా... భూ దందాలో దూసుకెళుతున్నార‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి భూమన కరుణాకర్ రెడ్డి విమ‌ర్శించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని పేరిట భూ దందాలు చేసిన ఘనత చంద్రబాబుద‌ని, మ‌హిళల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహ‌రించిన రాక్షస తీరును తాము తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నామ‌న్నారు. 
 
మహిళా సభ్యులను శాసనసభ నుంచి బయటికి పంపిన ఘనత ఆయనద‌ని, ఇక రాజ్యసభలో ప్రైవేటు బిల్లుకు సీఎం ర‌మేష్, సుజ‌నాలు చిల్లు పెట్టార‌ని ఆరోపించారు. గాంధీ విగ్ర‌హాల‌నూ పడేసిన చంద్రబాబు ప్రభుత్వం గాడ్సే ప్రభుత్వమ‌ని ఎద్దేవా చేశారు. మహిళలను వేధిస్తున్న ఇద్దరు మంత్రులు ఏపీలో ఉన్నార‌ని, ఆ మంత్రులను తొలగిస్తారో లేదో చంద్రబాబు విజ్ఞతకు వదిలేస్తున్నామ‌ని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌త్యేక హోదాపై సీఎం చంద్ర‌బాబుకు, పీఎం మోదీకి మ‌ధ్య ర‌హ‌స్య ఒప్పందం ఏంటి?