Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నా.. మీరంటే ఎనలేని గౌరవం... తుదిశ్వాస వరకు మీ వెంటే ఉంటా.. చంద్రబాబుతో నాగిరెడ్డి చివరి మాటలు

నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి హఠాన్మరణానికి ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 36 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను బాబుకు పరిచయం చేశారు.

అన్నా.. మీరంటే ఎనలేని గౌరవం... తుదిశ్వాస వరకు మీ వెంటే ఉంటా.. చంద్రబాబుతో నాగిరెడ్డి చివరి మాటలు
, సోమవారం, 13 మార్చి 2017 (09:31 IST)
నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి హఠాన్మరణానికి ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 36 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లను బాబుకు పరిచయం చేశారు. వీరంతా ఈనెల 17వ తేదీన జరుగనున్న జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణ రెడ్డిని గెలిపిస్తారంటూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత వారందరితో కలిసి గ్రూపు ఫోట్ దిగారు. పిమ్మట.. చంద్రబాబుతో ఏకాంతంగా గంటకుపైగా చర్చలు జరిపారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబుతో నాగిరెడ్డి మాట్లాడుతూ... 'అన్నా.. మీరంటే మాకు ఎనలేని గౌరవం. మేం ఏ సమస్య తీసుకొని వచ్చినా తక్షణమే స్పందిస్తారు. అడిగిన వెంటనే నంద్యాలలో 3 వేల మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేశారు. అభివృద్ధి కోసం రూ.కోట్ల నిధులు కేటాయించారు. మాకు ఎన్నో చేసిన మీకు నేను, మా కార్యకర్తలు రుణపడి ఉంటాం. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. మీ ఆదేశాల మేరకు మా కార్యకర్తలంతా ఏకతాటిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డిని ఊహించని మెజారిటీతో గెలిపిస్తార'ని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజక వర్గాల అభివృద్ధిపైనే చర్చించారని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. నేడు అంత్యక్రియలు.. రానున్న చంద్రబాబు - జగన్