Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా : అఖిలప్రియ

'మా అమ్మ శోభా నాగిరెడ్డి ఫోటోకు దండం పెట్టి.. దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా' అంటూ హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి చెప్పారు.

అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా : అఖిలప్రియ
, మంగళవారం, 14 మార్చి 2017 (12:16 IST)
'మా అమ్మ శోభా నాగిరెడ్డి ఫోటోకు దండం పెట్టి.. దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా' అంటూ హఠాన్మరణం చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి చెప్పారు. భూమా నాగిరెడ్డి మృతికి మంగళవారం ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా ఇందులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, సభ్యులు పాల్గొని మాట్లాడారు. విపక్షం వైకాపా మాత్రం ఈ సంతాప తీర్మానానికి దూరంగా ఉంటూ సభ నుంచి వాకౌట్ చేసింది.
 
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియా రెడ్డి సభలో తన తండ్రి గురించి మాట్లాడారు. ఎప్పుడైతే అమ్మ చనిపోయారో, అప్పటినుంచి ఆయన కోలుకోలేక పోయారు. ఆయన ఎంత బిజీగా ఉంటే, అంత త్వరగా మరచిపోతారని మేము అనుకున్నాం. కానీ బయటకు ధైర్యంగా ఉన్నా, రోజూ రాత్రి అమ్మ ఫోటోకు దండం పెట్టి దీపం పెట్టకుండా పడుకోడు అధ్యక్షా అంటూ అఖిలప్రియ కళ్ల వెంబడి నీరు పెట్టుకున్నారు.
 
భార్య మరణం తర్వాత ఆయన ఎంత ప్రయత్నించినా, బాధ నుంచి బయటకు రాలేకపోయారని, దాంతో ఆరోగ్యం మెల్లిమెల్లిగా పాడవుతూ వచ్చిందని చెప్పారు. గత వారమంతా ఆయన ఆసుపత్రిలో ఉన్నారని, ఆ సమయంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆలోచించారని, ఆఖరికి టెలీ కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. 
 
ఆక్సిజన్ మాస్క్‌తోనూ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయంపై మాట్లాడారాని గుర్తు చేసుకున్నారు. తాను మరణిస్తానేమోనని ఆయన ముందుగానే ఊహించినట్టు ఇప్పుడు అనిపిస్తోందని, అందుకే చివరిరోజుల్లో నంద్యాల, ఆళ్లగడ్డ అభివృద్ధి, పేదలందరికీ ఇళ్లు కట్టించాలని గట్టి ప్రయత్నాలు చేశారని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ ఆస్పత్రిలో అస్వస్థతతో చేరితే.. దినకరన్‌ను చూసి చేతులూపారా?: మునుస్వామి