Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల స్థానం మాదే... అభ్యర్థిని ప్రకటిస్తాం... బాబు మాటతో పనిలేదు.. భూమా అఖిల ప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స

Advertiesment
Bhuma Akhila Priya
, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:44 IST)
తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. 
 
ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు. 
 
మరిన్ని విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 
పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండానే నంద్యాల ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటిస్తామని భూమా అఖిల ప్రియా రెడ్డి ప్రకటించడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు ఆమెకు హామీ ఇచ్చారా? ఆ ధైర్యంతోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారా? అనే చర్చకు సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో షాక్