Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశ

Advertiesment
సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?
, బుధవారం, 10 మే 2017 (22:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం లభించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
 
బిజెపి సీనియర్ నేత, పట్టణాభివృద్థి శాఖామంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు భాను ప్రకాష్‌ రెడ్డి. బిజెపి అధికారంలో లేకున్నప్పుడు కూడా వెంకయ్యతో భాను సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఆ సఖ్యతే చివరకు ఆయన్ను టిటిడి పాలకమండలి సభ్యులను చేసింది. రెండు సంవత్సరాలు పాటు సభ్యులుగా ఉన్న భాను తిరిగి ఆ పదవి కోసం వెంకయ్యకు అర్జీ పెట్టుకున్నారట. దీంతో వెంకయ్య అయిపోయిందే అంటూ భరోసా ఇచ్చారట. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెంకయ్య మాట్లాడి భానుకు పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు భాను ప్రకాష్‌ రెడ్డికి టిటిడి పాలకమండలిలో మరోసారి అవకాశం రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ అడ్మిస్ట్రేషన్ సర్వీసెస్(IAS) అంటే తెలియదా పవన్...? ఘాటు కౌంటర్