Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణపై హిందూపురం ప్రజలు గుర్రుగా వున్నారా? ఎందుకు?

బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి రాజకీయాల్లో ఉన్నా ఆ రంగం వైపు వెళ్ళకుండా సినిమాల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానుల ఒత్తిడితో

బాలకృష్ణపై హిందూపురం ప్రజలు గుర్రుగా వున్నారా? ఎందుకు?
, శనివారం, 15 జులై 2017 (18:19 IST)
బాలకృష్ణ. నందమూరి కుటుంబంలో ప్రస్తుతం కీలక రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి. ఎప్పటి నుండో తండ్రి రాజకీయాల్లో ఉన్నా ఆ రంగం వైపు వెళ్ళకుండా సినిమాల్లో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటు అభిమానుల ఒత్తిడితో రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది తెలిసిందే. అయితే ప్రజాప్రతినిధిగాను, సినిమాల్లోను రెండింటికి పూర్తిస్థాయిలో బాలకృష్ణ న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు. 
 
అందుకు కారణం అభివృద్ధి జరగకపోవడమే. సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ పెద్దగా నియోజవర్గాల్లో పర్యటించలేదట. అప్పుడప్పుడు పర్యటించి వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా కుంటుపడుతోంది. దీంతో నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణపై కోపంతో ఉన్నారట. విషయాన్ని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ ఎలాగైనా తిరిగి ప్రజల ఆదరాభిమానాలను పొందాలని, దాంతో పాటు హిందూపురంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కొంతమంది సలహాలను తీసుకున్న బాలకృష్ణ తనపై ప్రజలకు ఉన్న కోపాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలా అని చర్చించారట. 
 
కనీసం వారానికి ఒకసారైని నియోజవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే తిరిగి తనను ఆదరిస్తారని తెలియడంతో ఆవైపు బాలకృష్ణ అడుగులు వేస్తున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ పాదయాత్ర... పవన్ రథయాత్ర... మరి బాబు ఏం యాత్ర?