Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీ హయాంలో మేధావులపై దాడులు.. అయిలయ్యకు భద్రత ఇవ్వండి

దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహ

మోదీ హయాంలో మేధావులపై దాడులు.. అయిలయ్యకు భద్రత ఇవ్వండి
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:35 IST)
దళితులు, అంబేద్కర్ వాదుల కోసం కంచ అయిలయ్య ఎంతో కృషి చేశారని ఆయనకు ప్రతిష్టమైన భద్రత కల్పించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మేథావులందరిపైనా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 
 
ఐలయ్యపే బెదిరిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఆర్య వైశ్యుల‌పై కంచ ఐల‌య్య రాసిన పుస్తకం వివాదాస్పదం కావడం… ఆయ‌న‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఓయూ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య తరువాత కర్ణాటక ప్రభుత్వం ఉలిక్కిపడింది. గౌరీ లంకేష్ హత్యలాగా మరో హత్య జరగకుండా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, బహుబాష నటుడు, సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ తో పాటు ప్రముఖులకు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇదే తరహాలో కంచ అయిలయ్యకు కూడా తెలంగాణ రాష్ట్రం భద్రత ఇవ్వాలని.. అలాగే మిగిలిన మేధావులకూ సర్కారు భద్రత ఏర్పాటు చేయాలని ఓవైసీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు కోసం అందాన్ని పెట్టుబడిగా పెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని..